GNTR: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరడం ఖరారైంది. ఇందులో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన విషయం తెలిసిందే. రాజకీయ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడంతో కిలారి రోశయ్యకు జనసేనలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.