KKD: పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ కోరారు. స్వచ్ఛత మహోత్సవంలో భాగంగా శనివారం సామర్లకోట రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరూ ఒక్కో మొక్క నాటితే వనమే ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. అధికారులు రవికాంత్, రామసుబ్బారావు, గిరి, కళ్యాణి, రామకృష్ణ, పాల్గొన్నారు.