నెల్లూరు: గూడూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు గ్రామంలో కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న బోరుకు మరమ్మతులు చేపట్టారు. వాటితోపాటు అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్య పనులను కూడా పంచాయతీ సిబ్బంది చేపట్టారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలతో పంచాయతీ సిబ్బంది ఈ చర్యలు తీసుకున్నట్లు టీడీపీ నేత శ్రావణి రెడ్డి తెలిపారు.