WG: ఆకివీడులో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా మాదివాడ సరోజనీనాయుడు బాలికోన్నత పాఠశాలలోని లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినుల చేత శాంతి ప్రతిజ్ఞ చేయించారు. అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి రాజేశ్వరి, జ్యోతిరెడ్డి, నాగమణి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రామచెంచయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.