AP: జైళ్లు, సంస్కరణల బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖైదీల సంస్కరణలకు చర్యలు ప్రారంభమైనట్లు హోంమంత్రి అనిత అన్నారు. మహిళా ఖైదీల పిల్లలకోసం జైలులో అంగన్వాడీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ఖైదీల పరివర్తనల్లో మార్పు తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.