కాకినాడ: వన్ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 మంది పట్టుబడినట్లు CI నాగదుర్గారావు తెలిపారు. వారిని సోమవారం కాకినాడ SJSC మేజిస్ట్రేట్ సీహెచ్ ఎస్ వీవీ ఎన్ శేషారావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మిగిలిన 8 మందికి రెండు నుంచి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.