TG: వికారాబాద్ అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ శిబిరం ఇవాళ మూడోరోజు ముగిసింది. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక రుగ్మతల పరిష్కారానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలన్నారు.