జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ ఎడ్ల వెంకటయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై చర్చించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో కలిసి ముచ్చటించారు.