BHPL: రేగొండ మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రవాణా జరుగుతున్న సమాచారంతో సోమవారం ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.