PDPL: ముర్మూర్ కొమరన్న జాతరకు హాజరుకావాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ను జాతర ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకుడు గోపు ఐలయ్య కోరారు. సోమవారం ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయనను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 27 నుంచి మార్చి 3 వరకు మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, కల్యాణోత్సవం జరుగుతుందన్నారు.