BHNG: భువనగిరి పట్టణంలో తారకరామ నగర్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం కుక్క కరిచిన బాలుడిని ఇవాళ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్లోని LV ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబును చూసి కుటుంబ సభ్యులుతో మాట్లాడారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు నాయకులు పాల్గొన్నారు