PDPL: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సీతారామ కళ్యాణంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.