SKLM: జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను ప్రభుత్వం గమనించి తక్షణమే ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ బుధవారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 రైతులకు దక్కేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే, అన్నదాతలకు భరోసా కల్పించాలని అన్నారు.