NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నీరడి చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరపున తమను ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.