అన్నమయ్య: జిల్లాలో వెబ్ ల్యాండ్కు సంబంధించిన ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ నిశాంత్ పరిష్కరించారు. మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్ల పరిధిలో 10 మంది రైతులకు 1B పత్రాలను అందజేశారు. అలాగే 22A భూ సమస్యలు ఈ నెలలోనే డజన్ల కొద్దీ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. రైతులకు భూ రికార్డులు సక్రమంగా ఉండేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.