WGL: వరంగల్ నగరంలో గవిచర్ల క్రాస్ జంక్షన్లో నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల 95వ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత రాచర్ల బాలరాజు మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అమెరికా ఆధిపత్య విధానాలను విమర్శిస్తూ, మోడీ ప్రభుత్వం వాటికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.