KMM: జనవాసాల మీదుగా 11KV విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయడం సరికాదని సీపీఎం మధిర మండల కార్యదర్శి మంద సైదులు అన్నారు. కంభంపాడులో జనవాసాల మీదుగా విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ లైన్ను గ్రామా బయట నుంచి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.