అన్నమయ్య: మదనపల్లి కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ టీ. వెంకటేశ్వర్లు తెలిపారు. 1వ తరగతి దరఖాస్తులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. 2వ నుండి 5వ తరగతి దరఖాస్తులు కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. తరగతులు తాత్కాలికంగా గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నారు.