ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో నడిచే తమ వాహన శ్రేణిపై 0.5 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. మోడల్, వేరియంట్ ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే కమర్షియల్ వాహన ధరలను రకాన్ని బట్టి 1.5 శాతం పెంచిన విషయం తెలిసిందే.