HNK: పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్ని వారికి తోఫాలను అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మైనారిటీలు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.