VZM: దేశపాత్రునిపాలెం వద్ద ఈనెల 2న రాత్రి గోకాడ పద్మ మృతికి కారణమైన కారును సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు గురువారం తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో పాలకేంద్రం మూసేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ఘటనా స్థలంలో మృతి చెందారు. ఏ.ఎస్.ఆర్. జిల్లాకు చెందిన కారు యాజమానిపై కేసు నమోదు చేశామన్నారు.