GDWL: అమ్మవారి చల్లని చూపు కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు అని ఆలయ అర్చకులు తెలిపారు. గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం జమ్మిచేడులో మంగళవారం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామునే కృష్ణానది పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం చేసి, మంత్రోచ్ఛారణల మధ్య ఆకుపూజ, నిమ్మకాయ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.