NDL: జిల్లాలో 1,00,686 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం ‘ఉల్లాస్-అక్షరాంధ్ర’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ బృహత్తర కార్యం కోసం 10,667 మంది వాలంటీర్లు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. వీరికి త్వరలోనే శిక్షణ ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.