WGL: నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లికి చెందిన గాదే హరి ప్రసాద్ (35) ఆదివారం సాయంత్రం ఒర్లాపూర్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన హరి ప్రసాద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.