VZM: వేపాడ(M) సోంపురం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా సమన్వయకులు శ్రీరామమూర్తి, ఎల్ కోట ఎంఈఓ కూర్మారావు శుక్రవారం పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. వందరోజుల యాక్షన్ ప్లాన్పై ప్రగతిని సమీక్షించారు.