పాన్-ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. లేకుంటే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు రద్దవుతుంది. ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డు రద్దయితే ITR దాఖలు చేయడం కుదరదు. మీకు రావాల్సిన పన్ను రీఫండ్లు నిలిచిపోతాయి. బ్యాంకు లావాదేవీలు, మ్యూచ్వల్ ఫండ్లు వంటి పెట్టుబడులపై అధిక టీడీఎస్ విధిస్తారు.