ADB: ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా జాదవ్ విమల, ఉప సర్పంచిగా వర్షతాయి గెలుపొందారు. ఈ సందర్బంగా శుక్రవారం వీరితో పాటు వార్డు సభ్యులను గ్రామస్థులు కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్దలు వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పారదర్శకంగా పనిచేయాలని ప్రజలు కోరారు.