HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ రోడ్డుపై తిరిగే వాళ్లేందరో ఉన్నారు. అలాంటి వాళ్లని చూసిన జార్జ్ రాకేష్ బాబు అనే వ్యక్తి కరుణ కిచెన్లో ఒక్క రూపాయికే టిఫిన్ అందించడం ప్రారంభించాడు. రోజుకు దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఈ టిఫిన్ సెంటర్ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు మెనూ చేంజ్ చేస్తున్నట్లు రాకేష్ తెలిపారు.