విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న వన్డేలో సౌతాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ క్వింటన్ డికాక్(57), బావుమా(32) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, డికాక్ భారత్లో ఇప్పటివరకు చేసిన ప్రతి హాఫ్ సెంచరీ(6)ని శతకంగా మలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 16 ఓవర్లలో 93/1 పరుగులు చేసింది.