KNR: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాని లావుడ్య రవీందర్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. బీటెక్, ఎంబీఏ చదివి విదేశాల్లో పనిచేసి, హైదరాబాద్లో సొంత కంపెనీ నడుపుతున్న రవీందర్.. గ్రామాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చారు. శుక్రవారం ఆయన తన నామినేషన్ను కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి దాఖలు చేశారు. ఈ పరిణామం గ్రామస్తుల్లో ఆసక్తి నెలకొంది.