WNP: జిల్లా కేంద్రంలోని 2వ వార్డుకు చెందిన కమ్మరి వంశీ చారి శుక్రవారం రాత్రి కరెంట్ షాక్తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం జిల్లా ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహాన్ని చూసి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.