TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.