TG: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపంలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. చెత్తకుప్పలో ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో అది పేలింది. ఈ ఘటనలో కుక్క మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెత్తకుప్పలో మరో 4 నాటుబాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.