భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మ్యూజియంలో సచిన్, ధోనీ, కోహ్లీ విగ్రహాలు ఉన్నాయి.