కృష్ణా: గుడివాడలోని శ్రీనివాస్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న విధంగా ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు ఎటువంటి ఉపయోగం చేయబోవని మరింత బలహీనపరుస్తాయని తెలిపారు.