హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో 2 రోజుల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఇది తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ భాగంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, FDC ఛైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు వైవిధ్యతతో కూడుకున్నవని గవర్నర్ పేర్కొన్నారు.