E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో శ్రీ ఉమా లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల రెండో తేదీన అర్ధరాత్రి హుండీని గుర్తుతెలియని వ్యక్తి దొంగలించారు. ఆలయ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోకవరం ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన గుర్రం అదిత్య సాయికుమార్ దొంగతనం పాల్పడ్డాడని గుర్తించి అరెస్టు చేశారు.