మరోసారి భారత్, పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య నవంబర్ 16న మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టుకు జితేశ్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీ ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.