భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపిందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భారత మహిళల జట్టు విజయం.. గతంలో సాధించిన ప్రపంచ కప్ల కంటే గొప్పది. ప్రస్తుతం మహిళ జట్టు విజయంతో.. చాలామంది వనితలు క్రికెట్ను కెరీర్గా ఎంపిక చేసుకునేందుకు వారిలో ప్రేరణకు కారణమవుతుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.