PLD: నరసరావుపేట-గుంటూరు రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం, వేములూరిపాడు దర్గా సమీపంలో లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.