ATP: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన 8 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. అనంతపురం నగరంలోని ఎస్ఎల్ఎన్, శ్రీవాణి డిగ్రీ కళాశాలల్లో ముగ్గురు చొప్పున, గోరంట్లలోని ఎస్వీపీఎం కళాశాలలో ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ వెల్లడించారు.