MBNR: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లాలో శనివారం ఉచితంగా పల్లి విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.