WGL: ఉమ్మడి WGL జిల్లాలో సిండికేట్ వ్యాపారులు పత్తి, మక్కల రైతులను దోచుకుంటున్నారు. CCI కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఎనుమాముల మార్కెట్లో పత్తికి మద్దతు ధర రూ.8,000 ఉండగా, రూ.3,000 తగ్గించి కొంటున్నారు. తేమ, నాణ్యత సాకులతో రైతులను ముంచుతున్నారు. మక్కలకు మద్దతు ధర రూ.2,400 ఉంటే రూ.1,600-1,800కే కొంటున్నారు. చర్యలు తీసుకోవాలని రైతులు ఇవాళ కోరారు.