MNCL: బీసీలకు 42 రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ శనివారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై సీఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షంతో ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలన్నారు.