BHPL: మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం 4,29,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఆదివారం వరకు 1.29 లక్షల క్యూసెక్కుల వరద పెరిగింది. సుందిళ్ల పార్వతి బ్యారేజ్, ఎల్లంపల్లి, అన్నారం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.