MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల MPTC, ZPTC నేపథ్యంలో ప్రతి సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. తదుపరి ప్రజావాణి నిర్వహించే సమాచారాన్ని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తామన్నారు. అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.