KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసివచ్చే పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో కలిసి వచ్చే కాంగ్రెస్, సీపీఎం, మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికలపై రేపు నిర్వహించే సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.