RR: విజయదశమి పండుగను పురస్కరించుకొని వనస్థలిపురం శ్రీ గణేష్ ఆలయంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ అని అన్నారు.