HYD: విజయదశమి పర్వదినం రోజునే సాయిబాబా మహాసమాధి పొందిన విశిష్టతతో బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ విజయదశమి రావటంతో ఆలయాన్ని పూలు, దీపాలతో అద్భుతంగా అలంకరించి షమీ పూజ కార్యక్రమం కూడా ఘనంగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి బాబా ఆశీర్వాదాలు పొందారు.