KNR: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దుర్గామాత నిమజ్జన కార్యక్రమాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటలలోపు నిర్వహించాలని చొప్పదండి ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. రాత్రి 10 గంటల తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అర్ధరాత్రి సమయంలో ఎటువంటి ఊరేగింపులకు అనుమతులు లేవని, ప్రజలు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు.